జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: వేసవి సెలవుల్లో కొన్ని యూనివర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఖరారైనందున ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలను వేసవి సెలవుల్లోనూ తెరిచి ఉంచాలని ఆ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలని ప్రిన్సిపాళ్లకు సూచించింది.