వెల్దండలో భక్తిశ్రద్ధలతో బోనాలు – బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలిన రాంనగర్ కాలనీ వాసులు
- నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.! - September 10, 2026
- పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్ - September 10, 2026
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
వెల్దండ, సెప్టెంబర్ 09: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి తరలివెళ్లారు. ప్రతి కుటుంబం బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
