సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి1000339308.jpg

కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గడగోజు యాదయ్యచారి బుధవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయా పార్టీ నాయకులతో కలిసి వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, స్థానిక సర్పంచ్ చిలుముల సైదులు తదితరులు ఉన్నారు.

You may also like...