రాంచంద్రాపురంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని గురువారం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రములోని సండే మార్కేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆమె పెత్తందారి విధానానికి, దోపిడికి,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా, దొర దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరు చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని…