ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం

వెల్దండ ఆగస్టు 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా సర్పంచ్ మరియు బాలిక కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య యాదవ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు ఎండి సద్దాం, కాలూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...