ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే మహిళలకు ముప్పై మూడు శాతం సీట్ల ప్రకటన చేశామని తెలిపారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని ఎన్టీఆర్ అందించారని, అదే పార్టీకి మార్గదర్శకంగా కొనసాగుతోందన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని సాధించడం ఎన్టీఆర్కే సాధ్యమైన అరుదైన ఘనత అని కొనియాడారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయం లేదని, ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు.
