వైద్యశాఖలో కీలక నియామకాలు

తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నియామకాలు చేపట్టింది. డాక్టర్ అప్పయ్యను హనుమకొండ జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా, డాక్టర్ కె. ఆనంద్‌ను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా నియమించింది. ప్రజారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వైద్య సేవల పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

You may also like...