జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్ఐఆర్) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ మంగళవారం కూడా నిరసనను కొనసాగించాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్ ఓటరు ఫొటోతో ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు.