ఆగిర్యాలలో మే 5న జరిగే మహనీయుల జాతరను విజయవంతం చేయండి

ఆగిర్యాలలో మే 5న జరిగే మహనీయుల జాతరను విజయవంతం చేయండి

షాద్ నగర్ ప్రముఖ యువ నాయకులు కేకే కన్ స్ట్రక్షన్ అధినేత కేకే కృష్ణ పిలుపు

షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఆగిర్యాల అంబేద్కర్ యువజన సంఘం ఆగిర్యాల వారి ఆధ్వర్యంలో షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ విడుదలైంది. వచ్చే నెల 5న నాడు జరగబోయే 17వ మహనీయుల జయంతి జాతర వాల్ పోస్టర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పోతులనరేష్
ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిదులుగా కవి గాయకులు జక్క గోపాల్ ప్రముఖ వ్యాపార వేత్త, కేకే కన్స్ట్రక్షన్ అధినేత
కేకే కృష్ణ , బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్, ఆగిర్యాల మాజీ సర్పంచ్ గూడెం భీమసేన,
గూడెం చెన్నయ్య, తెలంగాణ రమేష్, గూడెం శీను ,చెవుల విజయ్ చెవుల జంగయ్య, గుమ్మడి రమేష్ దొడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.. కేపీ

You may also like...