శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికితప్పిన ప్రమాదం!

సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 03:
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి ప్రమాదం తప్పింది.ఎయిర్ పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది! దీంతో పైలట్ ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు! షటిల్ లో బోర్డై ఉన్న 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆందోళన రేకెత్తించింది

You may also like...

Translate »