తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
జ్ఞాన తెలంగాణ జనగామ :
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ , ఖమ్మం , నల్లగొండ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల సన్నాహక సమావేశం..
తొర్రూరు పట్టణంలోని రామ ఉపేంద్రమ్ గార్డెన్లో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ, నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులరా ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని పార్లమెంట్ ఎన్నికల్లో డా, కడియం కావ్య గారిని అఖండమేజరిటీతో గెలిపిద్దామన్నారు
పోయినసారి పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఒంటరిగా పోటీ చేసి ఒక లక్ష అరవై వేల పై చిలుక ఓట్లు సంపాదించి బిఆర్ఎస్ అభ్యర్థి ని గడగడ లాడించాడు, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ అండగా ఉంది అందరం కలిసి ఆకాండ మెజారిటీ అందిద్దాం..
ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, నిరుద్యోగ, సమస్యల పరిష్కరానికి నిరంతరం పట్టువదలని విక్రమార్కుడు తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పట్టబద్రుడు
ఉద్యోగ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎంప్లాయి ఫ్రెండ్లీ విధానం దేశానికే గర్వకారణం_
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతును రాజు చేయటామే ద్యేయంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది
గత ప్రభుత్వాలు ఏ విదంగా పరిపాలించాయో మీ అందరికి తెలుసు
నా నియోజకవర్గ పట్టభద్రులు, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి, పార్లమెంట్ అభ్యర్థి డా కడియం కావ్య మొదటి ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి లో పాలు పాలుపంచుకోవాలి_అని అన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రయివేట్ ఉద్యోగులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ ముఖ్యనాయకులు, పట్టభద్రులు, తదితరులు, పాల్గొన్నారు..
