అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం

అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 1055 వ రోజులో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్, రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద, మరియూ భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు, అన్నార్తులకు మరియూ యాచకులకు ప్రతీరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్టు ఫోన్. నం. 89855 88060కు అందించాలని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నేటి అన్నదాతలుగా మారం విశ్వవిరాట్, మారం స్వప్న కుమార్ దంపతులు, సిద్దంశెట్టి లావణ్య నాగరాజు దంపతులు, జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు అన్నారు.
నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, ప్రతాప నటరాజు, జూలపల్లి రాజు, ముంజ మహేష్, తోట రాజు, జవ్వాజి రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…
