ఆర్టిసి బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

- రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తా వద్ద ఘటన
- స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,నవంబర్ 7 :
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరవకముందే బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శుక్రవారం ఉదయం ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుకనుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
