భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

- నాకు భగీరథుడే ఆదర్శం ఎమ్మెల్యే మేఘారెడ్డి.
- పెద్దమందడిలో భగీరథుడి విగ్రహం ఆవిష్కరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,అక్టోబర్ 24: పట్టుదలలో భగీరథుడే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని…నేను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సగరుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుబడి ఉందన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ రిజర్వేషన్ తెలంగాణలో అమలు పరిచి దేశానికే రోల్డ్ మాడల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రిజర్వేషన్ల ప్రకారం సగరులకు అవకాశం ఉన్నచోట గుర్తింపు ఇస్తామన్నారు.పెద్దమందడి మండల కేంద్రంలో రూ.20 లక్షల రూపాయలతో సగరుల సామూహిక భవనాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
