వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :
వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ కార్యకర్త నేరోల్ల సాయిరాం అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ సాలూర శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.అనంతరం నేరోళ్ల సాయిలు మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని అన్నారు. హిందువులలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు.హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం , పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. అల్లే సాయన్న పాల్గొన్నారు. ఈకార్యక్రమం అనంతరం గ్రామ వీధుల్లో పథ సంచలన్ నిర్వహించారు.

You may also like...

Translate »