పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ

– కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద రైతుల నిరీక్షణ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21: కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11వేల ఎకరాలో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు తిండితిప్పలు వదిలి రాత్రి పగలే తేడా లేకుండా ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ ద్వారా ఇప్పటికే మూడు సార్లు సరఫరా చేసినా సాగు అవసరాలు తీరడంలేదు. గురువారం పీఎసీఎస్ కార్యాలయానికి ఒక లారీ లోడు 330 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జీరాక్స్ సీరియల్లో పెట్టి తమ వంతు కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. కొన్ని సందర్భాల్లో తోపులాట జరడగంతో పరిస్థితి అదుపులోకి తేచ్చేందుకు పోలీసులు పిలిపించి వారి పహారా మధ్య ఒక్కో రైతుకు బస్తా చొప్పున ఏఓ గిరి ప్రసాద్, సీఈఓ బండ మల్లా రెడ్డి పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. అప్పటికి చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో తాము ఎన్ని రోజులు యూరియా కోసం పనులు వదులుకొని తిరగాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మండల స్పెషల్ ఆఫీసర్ (జీఎం ఇండ్రస్ట్రీస్) సతీష్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అక్కడికి చేరుకొని రైతులకు సరిపడ యూరియా వస్తుందని, అందరికీ అందజేస్తామని చెప్పారు. రైతులు నానో యూరియాను వాడుకోవాలని అది కూడా పని చేస్తుందని రైతులకు సూచించారు. మండలానికి 2400 మెట్రిక్ టన్నుల యూరియా ఆసవరం ఉండగా ఇప్పటి వరకు 1800 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని మిగతా 600 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు పహారా మధ్య యూరియాను తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని దొరకని పరిస్థితి దావరించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

You may also like...

Translate »