ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికలకు ఉపాధి : ఎక్సైజ్ జమీందార్ ఎస్ కే జావిద్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ఈత మొక్కలను ఎండిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకన్న, గౌడ సంఘం అధ్యక్షులు బందార అచ్చాలు, పెద్ద గౌడు గుడుగుంట్ల వెంకన్న, పీల్డ్ అసిస్టెంట్ దాసరి యాదగిరి, కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి పోలగోని వెంకన్న, సభ్యులు దేశని రామకృష్ణ, గుడుగుంట్ల నగేష్, దండంపల్లి శ్రవన్, బింగి రాజు, దండంపల్లి సత్తయ్య, పనస శంకర్, దేశని వెంకటయ్య, దండంపల్లి మహేష్ పాల్గొన్నారు.
