బంద్ నేపథ్యంలో రేపు సెలవు

– జూలై 10న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
– బంద్ కారణంగా యాజమాన్యాల నిర్ణయం
– జూలై 11న యథావిధిగా తరగతులు
– విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం
– శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రకటన

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం (జూలై 10) సెలవును ప్రకటించాయి. విద్యార్థుల భద్రత, రవాణా సౌకర్యాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వెల్లడించాయి.

అయితే శనివారం (జూలై 11) యథావిధిగా తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని సూచించాయి. సెలవుకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని పాఠశాలల యాజమాన్యాలు కోరాయి.

You may also like...