వైఎస్సార్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

వైఎస్సార్‌ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై మరింత ఆందోళన పెంచుతోంది. కడప మాసాపేటకు చెందిన ఓ వ్యక్తి కుమారుడికి కూడా కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

అయితే, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తగిన ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లో కోవిడ్‌ వార్డు ఏర్పాటు చేసినప్పటికీ, అవసరమైన ప్రోటోకాల్ అమలు, ప్రజల్లో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

You may also like...