ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్‌ చేసి గర్భిణి ప్రాణం తీసిన ఆర్ఎంపి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆర్‌ఎంపీ మాఫియా అక్రమాలు కలకలం రేపుతున్నాయి. బాలాజీ ఆస్పత్రి పేరిట కేంద్రం ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్‌ఎంపీ శ్రీనివాస్‌ ఒక మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్‌ చేశాడు. అయితే ఐదు నెలల గర్భిణి విజేత ఆ ప్రక్రియలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You may also like...

Translate »