సినిమా అభివృద్ధికి సంపూర్ణ సహకారం:రేవంత్ రెడ్డి

- ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని నిలుపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్కు సంబంధించి వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు గారు, పృథ్వీ గారు, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ గారు, సింగర్ రోహిత్ గారు ముఖ్యమంత్రి గారు సన్మానించారు.కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్ గారు, భగవంత్ కేసరి గారు, నిర్మాత గారపాటి సాహు గారితో పాటు ఇతరులు పాల్గొన్నారు.






