ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్

నేరేడ్మెట్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30 వరకు చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు వెళ్లాలి. ఎల్బీనగర్, నుంచి నాగోల్ మీదుగా ఉప్పల్కు వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్ట్టేషన్ వద్ద టర్న్ తీసుకొని భగాయత్ లేఅవుట్మీదుగా బోడుప్పల్, ఫిర్జాదిగూడ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్ వైపు వెళ్లాలన్నారు….
