తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీ శ్రీనివాస్కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10వేల జరిమానాతో సహా షరతులతో కూడిన బెయిల్ను ఇచ్చింది. దాంతోపాటు ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్లో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అఘోరీ శ్రీనివాస్ మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నాడు. కరీంనగర కొత్తపల్లికి చెందిన ఓ యువతి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని కేసు పెట్టిన విషయం తెలిసిందే.