ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని
చిన్నారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజావాణిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కి వినతి పత్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
అందజేశారు. ప్రజావాణిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 510 జీ.ఓ. లో 4000 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని పరిష్కారం కోరుతూ వినతి సమర్పించడం జరిగింది.
ఎన్ హెచ్.ఎం.కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 2018 లో 510 జీ ఓ లో కొంతమందికి అన్యాయం జరిగింది.510 జీ.వో లో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రణాళిక సంఘం త్రి సభ కమిటీ మెంబర్ చిన్నారెడ్డి 510 గురించి వివరించనారు. 510 జీవోలో నష్టపోయిన 4000 కుటుంబాలకు వెలుగులు నింపాలని,చీకటిలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాన్. 510 జీవోను తయారుచేసి త్రి సభ కమిటీ మెంబెర్ చిన్నారెడ్డి కి సబ్మిట్ చేయడం జరిగింది. చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తాననీ హామీ ఇవ్వడం జరిగింది. 510 జీ.వో.లో అన్యాయం జరిగిన వారందరికీ సమాన పనికి సమాన వేతనం తో పాటు, క్యాడర్ ఫిక్సేషన్ చేసి 2018 నుంచి అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. పల్లె దావఖన డాక్టర్స్ డిజిగ్నేషన్ చేంజ్ చేయగలరని వారికి 40 వేల వేతనమే వస్తుందని 30 శాతం పి ఆర్ సి కలిపి 52,000 వేతనం చేయాలని డాక్టర్ పుట్ట మహేందర్ రావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్,సురేష్ గౌడ్, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కోర్నల్,లోకేష్,పల్లె దావఖన వైద్యాధికారి డాక్టర్.పుట్ట మహేందర్ రావు, దామల ప్రవీణ్,బాల్ రెడ్డి, ఆయుష్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఫార్మసిస్ట్ నవ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
