ఎడతెరపిలేని వర్షం..

  • కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం.. పట్టించుకొని అధికారులు

కట్టంగూర్, అక్టోబర్ 24 : మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయ్యాయి. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు కురుమర్తి బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. కల్మెర గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం లోతట్టు ప్రాంతం కావడంతో భారీ వర్షానికి రైతుల ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న వరద కాలువను ఆ ప్రాంతంలోని రైతులు ధ్వసం చేసి అక్రమించడంతో వరద నీరంత కేంద్రంలోకి చేరడంతో ధాన్యం రాసులు నీటిలో మునిగిపోయాయి. వర్షాలకు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు మాత్రం కేంద్రాల వైపు కన్నెసి చూడడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా మ్యాచర్ రావడం లేదనే సాగుతో కాంటాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కల్మెర పీఏసీఎస్ కేంద్రంలో నిలిచి వర్షపు -నీటిని తాసీల్దార్ పుష్పలత దగ్గరుండి జేసీబీతో సహాయంతో కింది ప్రాంతానికి తరలించారు.

ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలి: వనం శ్రీను రైతు దుగినవెల్లి

వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. వారం రోజుల క్రితం ఐదు ఎకరాలకు ధాన్యాన్ని కల్మెర పీఏసీఎస్ కేంద్రానికి తెచ్చి ప్రతి రోజు ఆరబెడుతున్నాం. కేంద్రాన్ని ప్రారంభించి మ్యాచర్ రావడంలేదని అధికారులు కాంటా వేయడం లేదు. రాత్రి, పగలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం. అకాల వర్షానికి సుమారు ఐదు బస్తాల ధాన్యం నీటిలో కొట్టుకుపోయాయి. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తడిది ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

You may also like...

Translate »