అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం
- భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవి.
- అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అర్జన్ శివయ్య.
- స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేగారి అరుణ్ కుమార్
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల రూరల్ ప్రతినిధి డిసెంబర్ 06 :
ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించీనా దేవునిఎర్రవల్లి గ్రామస్తులు.
డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు.
రిజర్వు బ్యాంక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. అలాగే అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం అలుపెరుగని పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడిన బహుముఖ ప్రజ్ఞశాలి అని ప్రశంసించారు.
కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత కోట్లాది ప్రజల జీవితాలకు మానవీయ హుందాను నిరాకరించాయి. ఇలాంటి వివక్షపూరిత సమాజంలో పుట్టిన ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. దళిత జాతులను కులం పేరుతో మంచినీటికి దూరం చేసిన అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని.
కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత కోట్లాది ప్రజల జీవితాలకు మానవీయ హుందాను నిరాకరించాయి. ఇలాంటి వివక్షపూరిత సమాజంలో పుట్టిన ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. దళిత జాతులను కులం పేరుతో మంచినీటికి దూరం చేసిన అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని….
అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం
కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత కోట్లాది ప్రజల జీవితాలకు మానవీయ హుందాను నిరాకరించాయి. ఇలాంటి వివక్షపూరిత సమాజంలో పుట్టిన ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. దళిత జాతులను కులం పేరుతో మంచినీటికి దూరం చేసిన అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ‘మహాద్ చెరువు’ పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమం. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనేక కుట్రల వలన అవి ఆచరణ సాధ్యం కానప్పటికీ నేటి రిజర్వేషన్ వ్యవస్థకు మూలమైనవి.
1927లో అంబేడ్కర్ ‘బహిష్కృత భారత్’ అనే పత్రికలో తిలక్ అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అనేవాడు కాదు, అస్పృశ్యతా నివారణ నా ధ్యేయం, నా జన్మ హక్కు అని నినదించేవాడని రాశారు. అంబేడ్కర్ రాకతో అణచివేతపై దిగువ కులాల పోరాట ఉద్యమాలు ప్రాంతీయ పరిధిని దాటి జాతీయస్థాయికి విస్తరించాయి. అవి ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే నినాదాలతో అందరిని సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేడ్కర్ విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే వారి సమస్యలకు పరిష్కారం దొరకదని భావించారు. అందుకే వీరికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను అందులో చేర్చి ‘భారత రాజ్యాంగ పిత’గా వెలుగొందాడు. పీడనకు గురైన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించాడు. అగ్రకులాల కుట్రలు ఛేదించి అందిరికీ ఓటు హక్కును కల్పించి, రాజకీయ సమానత్వం సాధించాడు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కు కొరకు పోరాడారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలకు సబబైన పరిష్కారం చూపారు. జీవిత చరమాంకంలో అంబేడ్కర్ ‘నా పుట్టుక నా చేతిలో లేదు కానీ, నా చావు నా చేతిలో ఉంది’ అని ప్రకటించి హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడిన బౌద్ధాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు.

నేడు ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తే… అంబేడ్కర్ రాజ్యాంగం జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్ష పేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేడ్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించిది. ఆయన జయంతిని ‘ప్రపంచ విజ్ఞాన దినోత్సవం’గా ప్రకటించడం మనందరికీ గర్వించ దగ్గ విషయం. కానీ, ఇప్పటికి ఆయనను దళిత నాయకుడుగా మాత్రమే సమాజం కీర్తించడం బాధాకరం. అన్నివర్గాలకు హక్కులు కల్పించిన విశ్వమానవుడు. నేడు మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులతో విలాస జీవితాలు అనుభవిస్తున్నాము తప్ప, ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాము. అయినప్పటికీ అగ్రకుల పార్టీలు ఆర్థికంగా బలహీన వర్గాలకు 10శాతం EWS రిజర్వేషన్లు కల్పించుకొన్నాయి. ఇది వారి జనాభా కన్నా అధికం. అయినప్పటికీ వెనకడిన వర్గాలు ఈ విషయాన్నీ ప్రశ్నించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో మెజార్టీ జనాభా గల బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేయాల్సింది రాజ్యాధికార యుద్ధం తప్ప, మరోటి కాదు. నేడు అన్నివర్గాల ఆత్మఘోషను వినిపించే భారత రాజ్యాంగ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. అగ్రకుల పార్టీలు ఒకటై రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాయి. రాజ్యాంగ రక్షకులు ఒకవైపు… రాజ్యాంగాన్ని మార్చేందుకు సంకల్పించిన శక్తులు మరొకవైపుగా దేశ రాజకీయ యుద్ధం జరుగుతుంది. కావున ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలకు వ్యతిరేకంగా ఓటు అనే ఆయుధంతో బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికార యుద్ధం చేయాలి. అప్పుడే సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుంది. అంబేడ్కర్ కోరుకున్నది కూడా అదే.
ఈ కార్యక్రమంలో , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అర్జన్ శివయ్య, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సామ మాణిక్యరెడ్డి , ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ కంకంటి శ్యామలయ్య, సామ విటల్ రెడ్డి, కరికే శ్రీనివాస్, పత్తి సత్యనారాయణ, సాకల్ పాండు, శ్రీనివాస్, మాసన్న గారి సుధాకర్ రెడ్డి, కరికే మల్లేష్ ,ఎదిరే రమేష్, ఎదురే రాములు, మంగలి నరసింహులు, కరికే సత్యం, ఎదిరే మల్లేష్, రాజు , ఎదిరే మాణిక్యం, రామకృష్ణ, కృష్ణారెడ్డి, మాణిక్యం, బేగరి కిష్టయ్య,మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్
జ్ఞాన తెలంగాణ ,చేవెళ్ల రూరల్ ప్రతినిధి