జహీరాబాద్లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు, ఆమె దేశ నిర్మాణానికి చేసిన సేవలను స్మరించారు. ప్రజాసేవలో ఇందిరా గాంధీ చూపిన ధైర్యం, సంకల్పం అందరికీ ఆదర్శం అని నాయకులు పేర్కొన్నారు.
పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
