రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహన్

తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి గారిని అతుల్ చౌహాన్ కలిశారు.
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఛాన్స్లర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని చౌహాన్ తెలియజేశారు.మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని, తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ ప్రతినిధి రామచంద్రం పాల్గొన్నారు.