అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్
చిన్నగూడూరు:-అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె తొమ్మిదవ రోజుకు చేరిన సందర్బంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గోని దీక్షకు తమ సంఘీభావం, పూర్తి మద్దతును తెలిపారు. ఈసందర్బంగా తేజావత్ అభినాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గత ఎన్నికల ముందు బిఆరెస్ ప్రభుత్వం తెలంగాణ లొ మళ్ళీ అధికారంలొకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్సోరిసింగ్, అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మినెంట్ చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు అదే కేసీఆర్ హామీలను అమలుచేయకుండ రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నడని. కేసీఆర్ మెడలు వంచి హక్కులను సాధించేవరకు ఆగేది లేదని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దత్తు తెలిపారని తాము అధికారంలొకి వస్తే మొదటి సంతకంతోనే అన్ని రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసే కార్మికులందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ దొరల పాలనను గద్దెదించి సమిష్టిగా బహుజన రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలొ బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, ,బిఎస్పీ జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ మరిపెడ, చిన్నగూడూరు మండలాల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి,డెంకెల నవీన్ గౌడ్,అంగన్వాడీ ల యూనియన్ మండల అధ్యక్షులు బి సులోచన, ఎం జ్యోతి, ఏ వెంకటరత్నం, జి వరలక్ష్మి, ఎండి పర్వీన్, పి కవిత బి సంధ్య తదితరులు పాల్గొన్నారు.