నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ :-
లోక్సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజ కవర్గం పరిధిలోని మహేశ్వ రం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.
రాత్రి 9 గంటలకు ఆర్కేపు రం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవు తారని వివరించారు…