ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ.

ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ.
- మరోసారి టెట్ పరీక్ష నిర్వహించి నోటిఫికేషన్ విడుదల చేస్తే చాలామందికి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది
- స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి
- ఎస్జీటీ,స్కూల్ అసిస్టెంట్ ల ప్రమోషన్ నిష్పత్తిని 50: 50 గా మార్చండి.
జ్ఞాన తెలంగాణ, హైదరబాద్: నేడో రేపో మెగా డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. నిరుద్యోగుల క్షేమం కోసం నిరుద్యోగుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు అన్నిటిని పరిగణలోకి తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.
మీరు మెగా డీయస్సీ పేరుతో దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈ వార్త చాలా మంది బీఎడ్ (BEd) అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిలించింది. దాదాపు గా నాలుగు లక్షల మందికి కేవలం 2629 స్కూల్ అసిస్టెంటు పోస్టులే చూపించడం అన్యాయం.
నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను మీముందుంచుతున్నాను. దయచేసి పరిశీలించగలరు.
- సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ (BEd) అభ్యర్థులకు ఎస్జీటీ (SGT) పోస్టులకు అర్హత లేనట్లే. ఈ లెక్కన కొత్త BEd కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది.
- BEd చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు.
- గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ (TET) నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించాలి. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్, డీయస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. Online కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.
- ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70%పదోన్నతి, 30 %డైరెక్టు రిక్రూట్మెంట్. దీని వల్ల బీ ఎడ్ (BEd) అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో vitality దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్ ను మారిస్తే అందరికీ లాభమైతది.
అని ట్విట్టర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి సూచనలు చేశారు.
