పీవీ సింధు ముందంజ


జ్ఞాన తెలంగాణ,చాంగ్జౌ: భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు. సింగిల్స్‌ మొదటి రౌండ్లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకి (జపాన్‌)పై, ఉన్నతి 21-11, 21-16తో గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై గెలిచారు. రెండో రౌండ్లో సింధుతో ఉన్నతి అమీతుమీ తేల్చుకోనుంది. సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం 21-13, 21-9తో జపాన్‌ జోడీ మిత్సుహషి/ఒకమురను అరగంటలోనే ఇంటిబాట పట్టించింది

You may also like...

Translate »