తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు.

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు.

హైదరాబాద్ జనవరి 07:తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్య మంత్రి సమావేశమయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వా నించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం పేర్కొన్నారు తమ ప్రభుత్వ సహాయ సహకా రాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం తెలిపారు.వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.టైర్-2, 3లలో ఐటీలను అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యో గాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదన్నారు.సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్ స్పెషల్ సెక్రటరీ విష్ణురెడ్డి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్ కార్పొరేట్ వ్యవహారాలు చింతన్ థాకర్ శ్రీస భార్గవ మొవ్వ పాల్గొన్నారు.

You may also like...

Translate »