భూమి లేని నిరుపేదలకు రూ.12,000 /- ఆర్థిక చేయూత

- అన్నదాతల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకోని కాంగ్రెస్స్ ప్రభుత్వం అన్ని పథకాలు రైతులకు లబ్ధి కోసమే
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చారిత్రాత్మకం .
- వనపర్తి ఎంఎల్ఏ తూడి మేఘారెడ్డి గారు.
జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,
అన్నదాతల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేక్కూర్చుతాయని వనపర్తి ఎంఎల్ఏ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. వారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్ ప్రభుత్వం రైతు భరోసాను రూ.12,000/- వేలను పెంచిందన్నారు. గత ప్రభుత్వం కేవలం రూ.10,000/- వేలు మాత్రమే రైతు బంధు ఇచ్చిందన్నారు.అంతకంటే ఎక్కువగా రైతు భరోసా పతకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరానికి రూ.12,000/- వేల చొప్పున రైతులందరికీ పెట్టుబడి సాయం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికి ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లింపు జరుగుతుందన్నారు.గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్ళు రప్పలు,రోడ్డు రహదారులకు ,రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా నిలిపివేయడంతో నిజమైన రైతన్నలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఈ అనర్హులను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రత్యేక అధికారుల బృందం చేపడుతుందని ఆయన అన్నారు.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేది నాటికి 75 సం. పూర్తి అవుతాయని ఈ రిపబ్లిక్ డే వేడుకల పురస్కరించుకొని అదే రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయునున్నట్లు ఎంఎల్ఏ తూడి మేఘా రెడ్డి గారు చెప్పారు.భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను అదుకునేయందుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నుత కార్యక్రమం చేపట్టిందని దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12,000/- వేలు నగదు ఆర్థిక సహాయం అందజేయునున్నట్లు ఆయన పేర్కొన్నారు.