సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహణపైన చర్యలు తీసుకోవాలి

  • భూ సమస్యలను పరిష్కరించాలి
  • ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి ఆగస్టు 19 :
హైదరాబాద్ లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులను కలిసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల కలిసి జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యక్రమాలను నియంత్రించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగారు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ గారికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య, సాయితేజ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »