నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన నేతలు:

నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన నేతలు:
జ్ఞాన తెలంగాణ,నారాయణపేట ఏప్రిల్ 18:
మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటున్నట్లు లీగల్ సెల్ కన్వీనర్ లో నామాజి తెలిపారు. నారాయణపేట పట్టణంలోని అన్ని వార్డుల నుండి నాయకులు తరలివెళ్లారని తెలిపారు.
ఎంపీగా డీకే అరుణ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.