భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • మర్రిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ రెడ్డి

నల్లగొండ జిల్లా మర్రిగూడ ప్రతినిధి, (అక్టోబర్ 29): జ్ఞాన తెలంగాణ :

తుఫాన్ కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాల్లో భాగంగా మర్రిగూడ మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్ ఐ కృష్ణ రెడ్డి బుధవారం పరిశీలించారు. రాబోయే రోజుల్లో కూడా మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, మర్రిగూడ మండల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మర్రిగూడ మండల కేంద్రంలో ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వెంటనే ఆయా గ్రామాల పరిధిలోని వాగులు, కుంటలు, చెరువులలోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించారు. మరింత పటిష్టంగా బందోబస్త్ నిర్వహించాలని, ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టం చేయాలన్నారు.ముఖ్యంగా, రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు, నాళాల దగ్గర రోడ్డులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిధిలో ఉన్న పోలీస్ స్టాప్ ఇతర శాఖల అధికారులు , గ్రామాల పెద్దలతో కలసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. బందోబస్త్ విధులలో పాల్గొనే సిబ్బంది , అధికారులు తప్పకుండా రెయిన్ కోట్లను వినియోగించి, తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.


మర్రిగూడెం మండల ప్రజలకు ఎస్సై కొన్ని కీలకమైన సూచనలు చేశారు:

  • ప్రజలు ఎవ్వరూ కూడా నీటి ప్రవాహం వేగంగా వెళ్తున్న వాగులను, కాలువలను, రోడ్డులను దాటే ప్రయత్నం చేయవద్దని,సంయమనం పాటించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనీ,
  • పాతబడిన ఇండ్లు మరియు శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవ్వరూ కూడా ఉండవద్దనీ,ప్రమాదాలు జరగకుండా తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని,
  • వర్షాకాలానికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని,
  • ఎవరికైనా ఏదైనా అత్యవసరం ఉండి, పోలీస్ సహాయం అవసరమైతే, వెంటనే ఆయా పోలీస్ స్టేషన్స్ అధికారులకు గాని, డైల్ 100 కి గాని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ గ 8712670231కు గాని కాల్ చేయాలని మర్రిగూడ ఎస్ ఐ తెలియజేశారు.
    ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని అన్నారు.

You may also like...

Translate »