ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం..!!

రేపు అధికారికంగా ముగియనున్న ఉపసంహరణ గడువు.. అనంతరం అధికారిక ప్రకటన


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయింది.
నామినేషన్ల పరిశీలన అనంతరం తెలంగాణలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ పోటీలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు సమర్పించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన వెలువరించనుంది. ఇండిపెం డెంట్ల నామిషన్లు నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనం కానుంది.

You may also like...

Translate »