ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని మండిపడ్డారు.మౌలిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇది నాగాలాండ్ ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
