గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం..

  • గత పాలకులకు భిన్నంగా రాష్ట్రంలో ప్రజారంజక పాలన..
    నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 22 : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తునున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేసిన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కలలకు ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదేశానుసారం 20నెలల కాలంలో నియోజకవర్గంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఊరురా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇండ్లు, జీపీ, అంగన్వాడీ భవనాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుందని తెలిపారు. గత పాలకులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో గత పాలకులకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు. ఇరిగేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చి బాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా నార్కట్ పల్లి, ఏపీ లింగోటం, గచ్చుగూరి చెరువులు నింపి ప్రణాళిక బద్దంగా రైతులకు సాగరునీరు అందించనున్నట్లు తెలిపారు. దేశంలో ఒక తెలంగాణలోనే కాదు ఏపీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాలో యూరియా కొరత ఉందన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నా యూరియా ఆలస్యమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. రామగుండం ఎరువుల ఉత్పత్తి కారాగారంలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా సరిపడ యూరియా రావడంలేదని పేర్కొన్నారు. ఎరువుల కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సృష్టించిందేనని, ప్రతి రైతుకు తగింతా యూరియా అందజేస్తామన్నారు. అనంతరం నూతన బోరుమోటరును స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్ డీఓ శేఖర్ రెడ్డి , మండల ప్రత్యేక అధికారి సతీష్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, ఎంపీఓ స్వరుపారాణి, పీఆర్ జేఈ జలీల్, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, మాజీ సర్పంచ్ పులిగిల్ల అంజయ్య ఏపీఓ కడెం రాంమోహన్, నాయకులు రెడ్డిపల్లి సాగర్, చౌగోని సాయిలు, మాద లింగస్వామి, ముక్కాముల శేఖర్, అజయ్ కుమార్ రెడ్డి, గాలి కృష్ణ, పెంజర్ల రవి, నాగరాజు, మాద సైదులు, తుమ్మల లింగారెడ్డి, మాద శంకర్, మాద భాస్కర్, పెంజర్ల నరేందర్, జానకిరెడ్డి, అనిల్ రెడ్డి , అయితగోని నర్సింహ్మ, నంద్యాల వెంకట్ రెడ్డి, బుచ్చా వెంకన్న, గుండు పరమేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »