సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా మన సాయన్న బిడ్డ.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. కంటోన్మెంట్ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది……
