గర్భవతులు పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి


-అంగన్వాడీ సూపర్వైజర్ జయప్రద.
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 30:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో ని కోసుర్ పల్లి ఫోర్త్ కేంద్రాన్నీ అంగన్వాడీ సూపర్వైజర్ జయప్రద సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భవతుల బాలింతల గృహ సందర్శనలు చేసారు తల్లులకి కుటుంబ సభ్యులందరికీ గర్భవతి దశ నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార పదార్థాలు,వ్యక్తిగత శుభ్రత, త్రాగే నీరు, ప్రతినెల ఆరోగ్య పరీక్షలు, టీకాలు బరువులు చూసుకోవడం చేయడంవల్ల తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, అలాగే ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని సూచించి తల్లి పిల్లల బరువులు తీసి ఎదుగుదల కార్డులను ఉపయోగించి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూచికల ద్వారా తెలుసుకోవాలని తెలియచేసారు ఈ కార్యక్రమంలో సుజాత భాగ్యలక్ష్మి టీచర్స్ తల్లులు, గర్భవతులు హాజరైనారు.

You may also like...

Translate »