చేవెళ్ల కాంగ్రెస్ లోకి భారీ వలసలు..

చేవెళ్ల కాంగ్రెస్ లోకి భారీ వలసలు..
భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్!
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల నియోజక వర్గం లో భారీ మెజారిటీ సాధించే దిశగా చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్ పావులు కదుపుతున్నారు. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రతి గ్రామాన్ని, ప్రతి నాయకుడిని పార్టీలకు అతీతంగా కలుస్తూ, వారిని కాంగ్రెస్ లోకి రప్పించడం లో భీమ్ భరత్ అహర్నిశలు కష్టపడుతున్నారు అని దానికి రోజు రోజుకు, ఆయా పార్టీల నుంచి గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ భీమ్ భరత్ నాయకత్వం పై నమ్మకం తో కాంగ్రెస్ లోకి భారీగా చేరుతున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ , నిరంతరం నియోజక వర్గ అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తున్న భీమ్ భరత్ నాయకత్వ పటిమ పలు పార్టీల నాయకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమం లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్న భీమ్ భరత్ వెంట నడవడానికి వారంతా పార్టీలకు అతీతంగా తమ సంపూర్ణ మద్దతును తెలిపి భీమ్ భరత్ నాయకత్వం లో పనిచేయడానికి భారీగా కాంగ్రెస్ లోకి తరలి వస్తుండటం భీం భరత్ కృషికి నిదర్శనం. ఆ క్రమంలో లోనే ఆదివారం నాడు భీమ్ భరత్ స్వగృహం లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులు, మాజీ సర్పంచ్ లు తమ అనుచరులతో భీమ్ భరత్ సమక్షం లో కాంగ్రెస్ సభ్యత్వం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా భీమ్ భరత్ వారిని సగౌరవంగా పార్టీ లోకి ఆహ్వానించారు. తన నాయకత్వం పై నమ్మకం తో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ తో విజయం సాధించి తమ సత్తా చస్తుతామని తెలిపారు.ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాల్కవోల్ల సాయి కుమార్,బెగరి బాలరాజు ,ఎం బాలరాజు,మద్దెల శ్రీను,అట్టపురం నర్సింలు,పల్గుట్ట శ్రీశైలం,బూరుగుపల్లి కొండ రెడ్డి , ఎన్ నరేందర్ రెడ్డి, డి రవీందర్ రెడ్డి ,ఎండీ నసీర్,వెంకటేష్,ఎం కమల్ ,నారెగుడెం పాండు రంగ రెడ్డి, పి శ్రీనివాస్, అలంపల్లీ కిష్టయ్య,అలంపల్లి బాలు, చించాల్పెట్ గ్రామ అధ్యక్షులు ఎం పాండు రంగ రెడ్డి , ఉపాధ్యక్షులు కముని వెంటయ్యా, ఎండీ అద్నాన్ ,శేకర్ , వెంకటయ్య,హన్మంతు యాదవ్, శంకర్ రెడ్డి , టీ వినయ్ తదితరులు పాల్గొన్నారు…..