ఇంటింటి ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని

ఇంటింటి ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని
ఇంటింటికి తిరిగి కరపత్రం అందించి ఓటు వేయాలని విజ్ఞప్తి* ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు – బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ – మంగలి బాలరాజ్ మాజీ ఎంపీటీసీ – రవీందర్ యాదవ్ ఎంపీటీసీ కందవాడ జ్ఞాన తెలంగాణ చేవెళ్ల చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంగలి బాలరాజ్ పిలుపునిచ్చారు. చేవెళ్ల మండల పరిధిలో గల ముడిమ్యాల. కుమ్మేరా గ్రామాలలో పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రం అందించి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ నేతృత్వంలో పేదల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయి మద్దతు కాసాని జ్ఞానేశ్వర్ గారికి వుండాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోని గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కానుకగా ఇద్దాం అని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు,శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.