పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని శుక్రవారం ఓ అధికార ప్రకటనలో పేర్కొంది. వాటిని రాష్ట్ర్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో స్వీకరిస్తామని తెలిపింది. ఏటా ప్రదానం చేసే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా నిలుస్తాయి. మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ https://mha.gov.inలో, పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.inలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.