ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 22.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈనెల 24 నుండి జూన్ 3 వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (27) పరీక్ష కేంద్రల వద్ద 144 సిఆర్పిసి సెక్షన్ విదించనైనది తెలిపారు.

ఈనెల 24 నుండి జూన్ 3 వరకు ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 7:00 గం: వరకు అమల్లో ఉంటుందిని. పరీక్షలు జరుగు సమయంలో సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పోలీసు అధికారులు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటారని పోలీస్ అధికారులు పరిక్ష సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్లో నుండి పరిక్ష పత్రం పరిక్ష కేంద్రానికి వెళ్ళే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ వుండాలని పరిక్ష కేంద్రాల వద్ద పట్టిఇష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షా సమయానికే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు.

You may also like...

Translate »