రేపు జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) ఫలితాలు విడుదల?

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షల ఫైనల్‌ ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ ‘కీ’ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 319 నగరాల్లో, దేశం వెలుపల 22 నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన మొదటి సెషన్‌ తోపాటు రెండో సెషన్‌కు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ర్యాంకులను ఎన్టీఏ (NTA) ప్రకటిస్తుంది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 25న జేఈఈ సెషన్‌ 2 ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ స్కోరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

You may also like...

Translate »