ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వ సంవత్సరం సందర్భంగా జూలై 7 నాడు జరిగే మాదిగల కవాతును విజయవంతం చెయ్యాలి.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వ సంవత్సరం సందర్భంగా జూలై 7 నాడు జరిగే మాదిగల కవాతును విజయవంతం చెయ్యాలి.
జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 7
MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో MRPS MSP MSF మరియు అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ను ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఈ సమావేశంలో MSP జిల్లా నాయకుడు దుబ్బ దానయ్య మాదిగ మాట్లాడుతూ “జూలై 7 నాడు MRPS 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో జరిగే మాదిగల కవాతును విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కవాతు మాదిగల ఆత్మగౌరవనికి ప్రతీకగా ప్రతి ఒక మాదిగ చూడాలని, లక్షలాది మంది మాదిగలు ఈ కవాతుకు హాజరై విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది.
MRPS MSP MSF జిల్లా నాయకత్వం గ్రామగ్రామాన తిరిగి నూతన కమిటీలు నిర్మాణం చేసి, జెండా గద్దెలు నిర్మాణం చేసి మాదిగలను ఏకం చేసి మాదిగల కవాతుకు సన్నహద్ధం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సమావేశంలో MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ MRPS జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ MSF జిల్లా అధ్యక్షులు కొల్లూరి హరీష్ మాదిగ MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ MRPS జిల్లా కార్యదర్శి నల్ల స్వామి మాదిగ కుశంగాల కుమార్ మాదిగ MRPS మూటకొండూర్,పోచంపల్లి, తుర్కపల్లి మండల కన్వీనర్లు అడెపు శ్రీనివాస్ మాదిగ పాముకుంట్ల బసవయ్య మాదిగ వంకరి శ్రీకాంత్ మాదిగ MRPS భువనగిరి పట్టణ కన్వీనర్ కోళ్ల జహంగీర్ మాదిగ లు తదితరులు పాల్గొన్నారు
