చంద్ర బాబు గుండెకాయ కుప్పం ప్రజలు:
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జ్ఞాన తెలంగాణ కుప్పం:
చంద్ర బాబు గుండెకాయ కుప్పం ప్రజలు:
చిత్తూరు జిల్లా కుప్పం :
స్థానిక కుప్పం పట్టణం నందున్న టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పి ఎస్ మునిరత్నం
మాట్లాడుతూ కుప్పం తన ఉనికిని కోల్పోలే దని నలబై సంవత్సరాలు సుధీర్ఘంగా కుప్పం ప్రజలు చంద్రబాబు కి పట్టం కట్టారని అది ఎప్పటికి చేదిరిపోనిదని చంద్రుని కాంతి నిండు పున్నమిలా వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయని మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతున్నదని కొనియాడారు. ఐదేండ్లగ్రహణం ఇప్పుడు విడిపోయిందని చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని జగన్నాసుర రాజ్యం హస్తమించి,చంద్రన్న రాజ్యం ఉదయించిందని ఎవరు విమర్శించని ఫలితాలు గత ఫలితాల్ని విశ్లేసిస్తే భిన్నంగా 48వేలు ఓట్లు మెజారిటీతో గెలిచి కుప్పంకి ఎదురులేని మనిషి చంద్రబాబని మరొకసారి రుజువు పరిచారు.
అయితే కుప్పం అభివృద్ధికి అడ్డంకులు గతములో ఆగిపోయిన పనులు ఏదయినా ఉన్నపటికీ వాటిని నోచుకునేలా చేస్తామని
అమరావతి కాలనీ ఇండ్లు, కమ్యూనిటీ భవనాలు, ప్రాజెక్ట్ పనులు, హ్యాంద్రినీవా కాలువ పరిశ్రమలు, విమానాశ్రయం ఇవన్నీ కూడా పునః ప్రారంభించి కుప్పం ప్రజల అభివృద్ధికి దోహదపడేలా కృషి చేస్థామని వెల్లడించారు. రైతులకి స్వయం ఉపాధి, ఇంకా కుప్పాన్ని ఇతర రాష్ట్రలైన కర్ణాటక, చెన్నై వంటి రాష్ట్రాలకి ప్రధాన రహదారులుతో కలుపుతూ జాతీయ స్థాయి గుర్తింపు కి తెస్తామని సందేశాన్ని ఇచ్చారు .ఈ సమావేశంలో చంద్రబాబు గెలుపు ప్రజా తీర్పని ప్రజలకి ఏమికావాలో అభివృద్ధికి కృషి చేస్తామని ఎటువంటి క్రమశిక్షణ రాహిత్యం జరగకుండా చూస్తామని ఎటువంటి కక్ష్యసాధింపులు ఉండవని అందరి తో ను సమాధానంగా ఉంటామని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియచేసారు. ఈ సమావేశంలో కుప్పం ఇంచార్జి మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్,పి ఎస్ మనోహర్, గాజుల గోపి,మాజీ మార్కెట్ ఛైర్మెన్ సత్యేంద్ర, ప్రతాప్, డాక్టర్ వెంకటేష్, సుగుణమ్మ మొదలైన నాయకులు పాల్గొన్నారు
