రాష్ట్ర రాజముద్రను మార్చడం సరైన పద్ధతి కాదు. మాల మహానాడు డిమాండ్.

రాష్ట్ర రాజముద్రను మార్చడం సరైన పద్ధతి కాదు. మాల మహానాడు డిమాండ్.
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 30:
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం, ప్రభుత్వం మారగానే ప్రభుత్వ చిహ్నాలు మార్చడం సరైన నిర్ణయం కాదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నీలం నరేందర్ అన్నారు . బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మారుస్తానని అనడం, కాంగ్రెస్ బిజెపి దొండుదొండని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలయ్యేలా చూడాలని అన్నారు.